Cath Lab Inauguration: చిన్నకాకానిలో ఎన్ఆర్ఐ అకాడమీ ఆఫ్ సైన్సెస్లో అత్యాధునిక కాథ్ ల్యాబ్ ప్రారంభం
భారత మాజీ ఉపరాష్ట్రపతి శ్రీ ఎం. వెంకయ్య నాయుడు గారు శుక్రవారం గుంటూరు జిల్లా చిన్నకాకానిలోని ఎన్ఆర్ఐ అకాడమీ ఆఫ్ సైన్సెస్ ఆవరణలో అత్యాధునిక ‘కాథ్ ల్యాబ్’ను ప్రారంభించి, నూతన ఆడిటోరియంకు శంకుస్థాపన చేయడం ఆనందంగా ఉందని తెలిపారు.
కేవలం 30 మంది ప్రవాస భారతీయ వైద్యుల కృషితో ప్రారంభమైన ఈ సంస్థ, నేడు 1050 పడకల స్థాయికి ఎదిగి, పేదలకు రాయితీపై నాణ్యమైన వైద్యం అందించడం అభినందనీయమని వెంకయ్య నాయుడు ప్రశంసించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,
భారతదేశంలో 60 శాతం మరణాలు జీవనశైలి వ్యాధుల (NCDs) కారణంగానే జరుగుతున్నాయని,
అనారోగ్యం కుటుంబాలను ఆర్థికంగా దెబ్బతీయడమే కాకుండా దేశ ఆర్థిక ప్రగతిని కూడా మందగిస్తుందని పేర్కొన్నారు.
వైద్యులు కేవలం చికిత్సకే పరిమితం కాకుండా, యోగా, వ్యాయామం, సరైన పోషకాహారం గురించి ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలని సూచించారు.
ఆరోగ్యకరమైన సమాజమే ‘వికసిత్ భారత్’ నిర్మాణానికి పునాది అని ఆయన స్పష్టం చేశారు.
ప్రకృతికి దగ్గరగా జీవిస్తే ఆరోగ్యం మెరుగుపడుతుందని, పాశ్చాత్య ఆహారపు అలవాట్లు మానేసి జొన్నలు, రాగులు వంటి తృణధాన్యాలను ఆహారంలో భాగం చేసుకోవాలని సూచించారు.
అలాగే వైద్య విద్యార్థులు తమ కెరీర్లో తప్పనిసరిగా కొంతకాలం గ్రామీణ సేవకు కేటాయించాలి, చికిత్స కంటే నివారణ మేలని ప్రజలకు తెలియజేయాలని వెంకయ్య నాయుడు పిలుపునిచ్చారు.
మరిన్ని Andra Pradesh News వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


