Passbooks with the royal seal: అక్కయ్యవలసలో భూమి పాస్పుస్తకాల పంపిణీ
శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళి మండలం అక్కయ్యవలస గ్రామంలో రైతులకు ప్రభుత్వ రాజముద్రతో కూడిన భూమి పట్టాదారు పాస్పుస్తకాలను (Passbooks with the royal seal)పంపిణీ చేసినట్లు మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. రైతుల భూమి హక్కులకు భరోసా కల్పించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు పేర్కొన్నారు.
గత వైసీపీ ప్రభుత్వం రైతుల భూముల భద్రతకన్నా వ్యక్తిగత ప్రచారానికే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చిందని ఆయన విమర్శించారు. పట్టాదారు పాస్పుస్తకాలపై ఒక వ్యక్తి ఫోటో ముద్రించడం ద్వారా రైతుల ఆస్తులను తమ సొంత జాగీరులా భావించిన పరిస్థితి ఏర్పడిందన్నారు. ప్రభుత్వ రాజముద్ర లేని ఆ పాస్పుస్తకాలు రైతుల్లో భరోసా కాకుండా భయాన్ని కలిగించాయని చెప్పారు.
ప్రస్తుత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ అహంకారపు గుర్తులను తొలగించి, అధికారిక ప్రభుత్వ రాజముద్రతో కూడిన పాస్పుస్తకాలను తిరిగి రైతులకు అందజేస్తోందన్నారు. వ్యక్తిగత ప్రచారాలకంటే ప్రభుత్వ గౌరవం, రైతుల భద్రతే ముఖ్యమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.
రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని, పారదర్శక పాలన ద్వారా అన్నదాతలకు పూర్తి భద్రత కల్పించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. రైతుల ముఖాల్లో చిరునవ్వు చూడటమే ఈ ప్రభుత్వానికి నిజమైన గౌరవమని పేర్కొన్నారు.
మరిన్ని Andra Pradesh News వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


