World Telugu Conference 2026:ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేడు గుంటూరుకు రానున్నారు.
గుంటూరు వేదికగా నిర్వహించనున్న మూడో ప్రపంచ తెలుగు మహాసభల కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొననున్నారు. ఈ ప్రతిష్ఠాత్మక సభకు తెలుగు భాషాభిమానులు, మేధావులు, రచయితలు, కళాకారులు దేశ విదేశాల నుంచి హాజరుకానున్నారు.
ఈ మహాసభల్లో గోవా గవర్నర్ శ్రీ ఆశోక గజపతిరాజు గారు కూడా ముఖ్య అతిథిగా పాల్గొననున్నారు. తెలుగు భాష, సంస్కృతి, సాహిత్యం, వారసత్వ పరిరక్షణపై ఈ మహాసభల్లో విస్తృతంగా చర్చలు జరగనున్నాయి.
ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలను ఒక్క వేదికపైకి తీసుకువచ్చే లక్ష్యంతో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం గుంటూరు జిల్లాకు విశేష గుర్తింపునివ్వనుంది. సీఎం చంద్రబాబు నాయుడు తన ప్రసంగంలో తెలుగు భాష ప్రాధాన్యం, భవిష్యత్లో తీసుకోవాల్సిన చర్యలపై కీలక సందేశం ఇవ్వనున్నట్లు సమాచారం.
ఈ నేపథ్యంలో గుంటూరులో భారీ ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు, భద్రతా చర్యలను కట్టుదిట్టం చేశారు.
మరిన్ని Andra Pradesh News వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


