back to top
19.7 C
Hyderabad
Thursday, January 15, 2026
HomeTelangana Newsకిష్టారెడ్డిపేట కేంద్రంగా నూతన డివిజన్ ఏర్పాటు చేయాలి.. లేకపోతే ఛలో బల్దియా: ఎమ్మెల్యే గూడెం మహిపాల్...

కిష్టారెడ్డిపేట కేంద్రంగా నూతన డివిజన్ ఏర్పాటు చేయాలి.. లేకపోతే ఛలో బల్దియా: ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

Kishtareddipet New Division: కిష్టారెడ్డిపేట కేంద్రంగా నూతన డివిజన్ ఏర్పాటు

పటాన్చెరు, (తేదీ): రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన జీహెచ్ఎంసీ నూతన డివిజన్ల ఏర్పాటు ప్రక్రియలో శాస్త్రీయత పూర్తిగా లోపించిందని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తీవ్రంగా విమర్శించారు. ఒక లక్ష 20 వేల ఓటర్లు కలిగిన అమీన్పూర్ మున్సిపల్ పరిధిలో కేవలం రెండు డివిజన్లు మాత్రమే ఏర్పాటు చేయడం ప్రజాస్వామ్య విరుద్ధమని పేర్కొన్నారు. వెంటనే మరో రెండు డివిజన్లు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ, లేనిపక్షంలో వేలాది మందితో కలిసి జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు.

Follow BuzzNewsline: Twitter (X) | Instagram

కిష్టారెడ్డిపేట కేంద్రంగా నూతన డివిజన్ ఏర్పాటు చేయాలని కోరుతూ అఖిలపక్షం ఆధ్వర్యంలో కిష్టారెడ్డిపేట గ్రామంలో నిర్వహిస్తున్న రిలే నిరాహార దీక్ష శిబిరాన్ని ఆదివారం గూడెం మహిపాల్ రెడ్డి సందర్శించారు. ఈ సందర్భంగా దీక్షకు సంపూర్ణ మద్దతు ప్రకటించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పరిపాలన సౌలభ్యం పేరుతో రాష్ట్ర ప్రభుత్వం జీహెచ్ఎంసీ పరిధిలో డివిజన్ల పునర్విభజన చేపట్టిందని, ఈ క్రమంలో పటాన్చెరు నియోజకవర్గ పరిధిలోని తెల్లాపూర్, అమీన్పూర్, బొల్లారం మున్సిపాలిటీలను జీహెచ్ఎంసీలో విలీనం చేసి ఆరు డివిజన్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అయితే క్షేత్రస్థాయిలో ప్రజల అభిప్రాయాలు, సర్వేలు నిర్వహించకుండా కేవలం గూగుల్ మ్యాప్స్ ఆధారంగా డివిజన్లు రూపొందించడం అన్యాయమని అన్నారు.

అమీన్పూర్ మున్సిపల్ పరిధిలో 1,20,000 ఓటర్లు, దాదాపు మూడు లక్షల జనాభా ఉన్నప్పటికీ కేవలం రెండు డివిజన్లు ఏర్పాటు చేయడం పరిపాలనా పరంగా అసంబద్ధమని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. పరిపాలన వికేంద్రీకరణతో పాటు సమగ్ర అభివృద్ధి జరగాలంటే ప్రతి 25 వేల నుంచి 30 వేల ఓటర్లకు ఒక డివిజన్ ఉండాలని స్పష్టం చేశారు.

ఈ అంశంపై ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వానికి, జీహెచ్ఎంసీ కమిషనర్‌కు వినతిపత్రాలు అందజేశామని తెలిపారు. అయినా స్పందన లేకపోతే అమీన్పూర్ మున్సిపల్ పరిధిలో మరో రెండు డివిజన్లు ఏర్పాటు చేసే వరకు పోరాటం ఆగదని స్పష్టం చేశారు. ప్రభుత్వం స్పందించకపోతే సంక్రాంతి అనంతరం అఖిలపక్ష సమావేశం నిర్వహించి తదుపరి కార్యాచరణను ప్రకటిస్తామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ దేవానందం, మాజీ వైస్ ఎంపీపీ సత్యనారాయణ, ఆయా గ్రామాల మాజీ ప్రజాప్రతినిధులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, అఖిలపక్ష కమిటీ సభ్యులు, ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

మరిన్ని Telangana News వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Buzznewsline
Buzznewsline
BuzzNewsline is a next-gen digital media platform delivering real-time news, trending stories, and deep insights across sports, politics, entertainment, tech, and more — all in one place.”

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest Articles