CM Revanth Reddy Visit: జిల్లా కలెక్టర్, పోలీస్ కమిషనర్తో కలిసి ఏర్పాట్లపై సమీక్ష
కరీంనగర్: చొప్పదండి మండలం గుమ్లాపూర్లో నిర్వహించనున్న బహిరంగ సభకు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ ఏ. రేవంత్ రెడ్డి గారు హాజరుకానున్న నేపథ్యంలో, సభా ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి గారు, పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం (IPS) గారితో కలిసి పరిశీలించారు.
ఈ సందర్భంగా బహిరంగ సభ నిర్వహణకు సంబంధించిన భద్రతా ఏర్పాట్లు, వేదిక నిర్మాణం, పార్కింగ్, ట్రాఫిక్ నియంత్రణ, ప్రజలకు సౌకర్యాలు తదితర అంశాలపై అధికారులకు పలు సూచనలు చేశారు. సభను సజావుగా, ఎలాంటి ఇబ్బందులు లేకుండా నిర్వహించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు.
సీఎం పర్యటన సందర్భంగా ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ముందస్తు ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
మరిన్ని Telangana News వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


