Harvard Kennedy School: హార్వర్డ్ కెన్నెడీ స్కూల్లో “21వ శతాబ్దంలో నాయకత్వం” కోర్సు పూర్తి
కేంబ్రిడ్జ్ (అమెరికా): తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ శ్రీ అనుముల రేవంత్ రెడ్డి ప్రతిష్టాత్మక హార్వర్డ్ యూనివర్సిటీకి చెందిన హార్వర్డ్ కెన్నెడీ స్కూల్లో నిర్వహించిన ఎగ్జిక్యూటివ్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ **“21వ శతాబ్దంలో నాయకత్వం (Leadership in the 21st Century)”**ను విజయవంతంగా పూర్తి చేశారు.
ఈ విషయాన్ని స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోషల్ మీడియా ద్వారా పంచుకుంటూ, ఎంతో ఆనందంతో పాటు నిరాడంబరమైన విజయ భావంతో ఈ కోర్సును పూర్తి చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రపంచవ్యాప్తంగా 20 దేశాల నుంచి 60 మందికి పైగా విద్యార్థులు పాల్గొనగా, అంతర్జాతీయ స్థాయి అనుభవజ్ఞులైన అధ్యాపకులు, ఉపాధ్యాయుల నుంచి మాత్రమే కాకుండా, తోటి విద్యార్థుల నుంచి కూడా అనేక విషయాలు నేర్చుకునే అవకాశం లభించిందని పేర్కొన్నారు.
కోర్సు సాగిన కాలంలో తీవ్రమైన మంచు తుఫాను పరిస్థితులు నెలకొన్నాయని, ఉష్ణోగ్రతలు ఎల్లప్పుడూ ఘనీభవన స్థాయికి దిగువగా ఉండగా, మూడు అడుగులకుపైగా హిమపాతం నమోదైందని తెలిపారు. తీవ్రమైన చలి గాలులు వీచినప్పటికీ, అధ్యయనంపై పూర్తి దృష్టి సారించి ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసినట్లు ఆయన వెల్లడించారు.
ఈ ప్రోగ్రామ్ సందర్భంగా ప్రపంచంలోని వివిధ ప్రతిష్టాత్మక విద్యాసంస్థల్లో చదువుకున్న, విభిన్న రంగాల్లో అద్భుత విజయాలు సాధించిన వ్యక్తులను కలిసినట్లు తెలిపారు. ఈ అనుభవం తన నాయకత్వ సామర్థ్యాలను మరింత మెరుగుపరుచుకోవడంలో దోహదపడుతుందని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
మరిన్ని Telangana News వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


