Ashwaraopeta Municipal Elections: మున్సిపల్ ఎన్నికల ప్రెస్ మీట్
అశ్వారావుపేట మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఈరోజు అశ్వారావుపేట పట్టణంలో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా కోఆర్డినేటర్ వేముల కార్తీక్ గారు ముఖ్యంగా పాల్గొని మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి పార్టీ వ్యూహాలు, ప్రజా సమస్యలపై వివరించారు.
ఈ కార్యక్రమంలో అశ్వారావుపేట ఇంచార్జ్ డేగల రాము గారు, అశ్వారావుపేట మండలం అధ్యక్షుడు ఇస్లావత్ వినోద్, ములకలపల్లి మండలం అధ్యక్షుడు తాటికొండ ప్రవీణ్, దమ్మపేట మండలం అధ్యక్షుడు ఎస్కే రహీం, ఆనపరెడ్డిపల్లి పసుపులేటి కిషోర్, చండ్రుగొండ టి. వేణు, జంగా చంద్రశేఖర్ పాల్గొన్నారు.
అలాగే జిల్లా యువజన నాయకులు గారికే రాంబాబు, మల్లం రామకృష్ణ, గుమ్మాల పోసి, మంగ్లోటు ఆనంద్, జర్పుల సాయి కిరణ్ తదితరులు ఈ సమావేశంలో పాల్గొని మున్సిపల్ ఎన్నికలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
అశ్వారావుపేట మున్సిపాలిటీలో ప్రజా సమస్యలను ప్రధానంగా తీసుకొని, ప్రజలకు అండగా నిలిచే విధంగా పార్టీ పోటీ చేయనున్నట్లు నేతలు తెలిపారు.
మరిన్ని Telangana News వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


