Telangana Temples Development: బాసర నుంచి భద్రాచలం వరకు రాష్ట్రంలోని ప్రధాన ఆలయాలన్నింటినీ సమగ్రంగా అభివృద్ధి
మేడారం పుణ్యక్షేత్రాన్ని ప్రపంచ స్థాయిలో తీర్చిదిద్దినట్టే, బాసర నుంచి భద్రాచలం వరకు రాష్ట్రంలోని ప్రధాన ఆలయాలన్నింటినీ సమగ్రంగా అభివృద్ధి చేయడానికి ప్రజా ప్రభుత్వం సిద్ధంగా ఉందని రాష్ట్ర సమాచార, రెవెన్యూ, గృహనిర్మాణ శాఖల మంత్రి శ్రీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు.
ఆలయాల అభివృద్ధితో పాటు, రాష్ట్రంలోని పర్యాటక రంగాన్ని కూడా బలోపేతం చేసేందుకు కేబినెట్ ఆమోదం లభించిందని ఆయన తెలిపారు. ఆధ్యాత్మికతకు కేంద్రాలైన దేవాలయాలను ఆధునిక వసతులతో అభివృద్ధి చేస్తూ, భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని పేర్కొన్నారు.
ప్రధాన ఆలయాలకు రహదారులు, తాగునీరు, పారిశుధ్యం, భక్తుల సౌకర్యాలు, వసతి గృహాలు వంటి మౌలిక వసతులను అభివృద్ధి చేయడం ద్వారా, ఆధ్యాత్మిక పర్యాటకాన్ని ప్రోత్సహించనున్నట్లు మంత్రి తెలిపారు. దీనివల్ల స్థానికులకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని, రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి తోడ్పడుతుందని ఆయన అన్నారు.
మేడారం మహా జాతర తరహాలోనే, ఇతర పుణ్యక్షేత్రాలు కూడా దేశవ్యాప్తంగా గుర్తింపు పొందేలా అభివృద్ధి చేయడం ప్రజా ప్రభుత్వ సంకల్పమని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు.
మరిన్ని Telangana News వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


