back to top
18.2 C
Hyderabad
Thursday, January 15, 2026
HomeTelangana Politicsప్రభుత్వ ఉద్యోగులు తీవ్ర మనోవేదనలో: డీఏలు, పీఆర్సీపై అసెంబ్లీలో హరీష్ రావు విమర్శలు

ప్రభుత్వ ఉద్యోగులు తీవ్ర మనోవేదనలో: డీఏలు, పీఆర్సీపై అసెంబ్లీలో హరీష్ రావు విమర్శలు

Telangana government employees: ప్రభుత్వ ఉద్యోగులు తీవ్ర మనోవేదనలో ఉన్నారు: అసెంబ్లీలో మాజీ మంత్రి హరీష్ రావు

ప్రభుత్వ ఉద్యోగులు అనేవారు ప్రభుత్వానికి రథచక్రాల వంటి వారు అని, వారు సంతోషంగా ఉంటేనే అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు సజావుగా చేరుతాయని మాజీ మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు. కానీ నేడు తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులంతా తీవ్రమైన మనోవేదనలో ఉన్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

Follow BuzzNewsline: Twitter (X) | Instagram

దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగులకు 6 డీఏలు పెండింగ్‌లో ఉన్నాయని, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు అవుతున్నా ఇప్పటివరకు పీఆర్సీ ప్రకటించలేదని విమర్శించారు. వెంటనే పీఆర్సీ విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

కేసీఆర్ హయాంలో ఉద్యోగులకు మేలు

గతంలో సీఎం కేసీఆర్ హయాంలో 43 శాతం, 39 శాతం పీఆర్సీలు అందించామని, ఉద్యోగుల కోసం ఎంప్లాయిస్ హెల్త్ స్కీమ్ (EHS) జీవోను కూడా అమలు చేశామని గుర్తు చేశారు. అయితే కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఈహెచ్ఎస్ అమలు చేస్తామని చెప్పి ఇప్పటివరకు అమలు చేయలేదని ఆరోపించారు.

రిటైర్డ్ ఉద్యోగుల దయనీయ పరిస్థితి

రిటైర్డ్ ఉద్యోగులకు సంబంధించిన బెనిఫిట్స్ అందక 39 మంది ఉద్యోగులు మనోవేదనతో మృతి చెందినట్లు తెలిపారు. తమ హయాంలో 17 వేల మంది ఉద్యోగులు రిటైర్ అయితే, అందరికీ సమయానికి బెనిఫిట్స్ అందించామని హరీష్ రావు స్పష్టం చేశారు.

రిటైర్డ్ వెటర్నరీ డాక్టర్ ఆవేదన

అసెంబ్లీకి వెళ్తున్న సమయంలో సిద్దిపేటకు చెందిన రిటైర్డ్ జేడీ వెటర్నరీ డాక్టర్ జగత్ కుమార్ రెడ్డి తనను కలిశారని చెప్పారు. అక్టోబర్ 2024లో రిటైర్ అయినప్పటికీ ఇప్పటివరకు ఒక్క రూపాయి కూడా రాకపోవడంపై ఆయన కన్నీటితో ఆవేదన వ్యక్తం చేశారని తెలిపారు.

హైకోర్టులో కేసు వేసినా ప్రభుత్వం రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వడం లేదని, 35 సంవత్సరాలు సేవ చేసిన ఉద్యోగులను ఇలా ఇబ్బంది పెట్టడం సరికాదని డాక్టర్ జగత్ కుమార్ రెడ్డి వాపోయారని చెప్పారు.

ఓల్డ్ పెన్షన్ స్కీమ్‌పై ప్రశ్న

ఓల్డ్ పెన్షన్ స్కీమ్ అమలు చేస్తామని చెప్పి రెండేళ్లు దాటినా ఎలాంటి పురోగతి లేదని హరీష్ రావు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

మరిన్ని Telangana Politics వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Buzznewsline
Buzznewsline
BuzzNewsline is a next-gen digital media platform delivering real-time news, trending stories, and deep insights across sports, politics, entertainment, tech, and more — all in one place.”

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest Articles