Municipal Elections: మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికలపై బీజేపీ వ్యూహాత్మక సమీక్ష
ఎలక్షన్ ఇన్చార్జ్లతో సమావేశం నిర్వహించిన ఎన్. రామచందర్ రావు
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో రానున్న మున్సిపల్ మరియు కార్పొరేషన్ ఎన్నికల నేపథ్యంలో, రాష్ట్ర బీజేపీ కార్యాలయంలో ఎలక్షన్ ఇన్చార్జ్లతో పార్టీ సీనియర్ నాయకుడు శ్రీ ఎన్. రామచందర్ రావు సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశంలో రాబోయే ఎన్నికల్లో ప్రతి మున్సిపాలిటీ, ప్రతి కార్పొరేషన్లో బీజేపీ జెండా ఎగురవేయడమే లక్ష్యంగా పార్టీ చేపట్టాల్సిన ప్రచార వ్యూహాలు, బూత్ స్థాయి కార్యాచరణపై సమగ్రంగా చర్చించారు. పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేస్తూ, క్షేత్రస్థాయిలో మరింత బలంగా పనిచేయాలని సూచించారు.
ప్రజా సమస్యల పరిష్కారం, పారదర్శక పాలన, సమగ్ర అభివృద్ధే బీజేపీ ప్రధాన అజెండా అని రామచందర్ రావు స్పష్టం చేశారు. ప్రజలకు జవాబుదారీతనంతో కూడిన పాలన అందించేందుకు బీజేపీ నిరంతరం పోరాడుతుందని తెలిపారు. ప్రతి కార్యకర్త ఎన్నికలను సవాలుగా తీసుకుని, ప్రజల మధ్య బీజేపీ విధానాలను బలంగా తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు.
మరిన్ని Telangana Politics వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


