back to top
31.2 C
Hyderabad
Sunday, March 1, 2026
HomeTelangana Politicsతెలంగాణ సమగ్రాభివృద్ధి దిశగా కీలక అడుగు – కల్వకుంట్ల కవిత

తెలంగాణ సమగ్రాభివృద్ధి దిశగా కీలక అడుగు – కల్వకుంట్ల కవిత

Telangana Jagruthi: 50 కమిటీల సభ్యులతో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు

తెలంగాణ రాష్ట్ర ప్రస్తుత స్థితిగతులు, సమగ్రాభివృద్ధి, వివిధ వర్గాల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, వాటికి సాధ్యమైన పరిష్కారాలు, వనరుల సమర్థ వినియోగంపై అధ్యయనం చేసేందుకు ఏర్పాటు చేసిన 50 కమిటీల సభ్యులతో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత గారు సమావేశం నిర్వహించారు.

Follow BuzzNewsline: Twitter (X) | Instagram

ఈ సమావేశంలో కమిటీ సభ్యులు తమ తమ అధ్యయనాల వివరాలను వివరించి, ప్రాథమిక నివేదికలను కల్వకుంట్ల కవిత గారికి సమర్పించారు. గ్రామీణాభివృద్ధి, వ్యవసాయం, మహిళా సాధికారత, యువత ఉపాధి, విద్య, వైద్యం, పరిశ్రమలు, సామాజిక న్యాయం వంటి అంశాలపై కమిటీలు లోతైన విశ్లేషణ చేపట్టినట్లు తెలిపారు.

ఈ సందర్భంగా కమిటీ సభ్యులు మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రం సమగ్రాభివృద్ధి సాధించాలంటే స్పష్టమైన దృష్టితో బ్లూ ప్రింట్ అవసరమని, అందుకు తెలంగాణ జాగృతి వేదికగా సమగ్రమైన కార్యాచరణ రూపొందించే పనిలో నిమగ్నమైందని పేర్కొన్నారు.

అలాగే, ప్రజల అభిప్రాయం మేరకు భవిష్యత్తులో రాజకీయ పార్టీ ఏర్పాటు దిశగా అడుగులు వేయాలని పలు కమిటీల సభ్యులు తమ నివేదికల్లో సూచించినట్లు సమాచారం. ప్రజా సమస్యలపై నేరుగా స్పందించే, ప్రజల ఆకాంక్షలను ప్రతిబింబించే రాజకీయ ప్రత్యామ్నాయం అవసరమని అభిప్రాయపడ్డారు.

తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా రాష్ట్ర భవిష్యత్తును తీర్చిదిద్దే లక్ష్యంతో తెలంగాణ జాగృతి ముందుకు సాగుతోందని ఈ సమావేశం స్పష్టం చేసింది.

మరిన్ని Telangana Politics వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Buzznewsline
Buzznewsline
BuzzNewsline is a next-gen digital media platform delivering real-time news, trending stories, and deep insights across sports, politics, entertainment, tech, and more — all in one place.”

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest Articles